షాద్నగర్టౌన్, డిసెంబర్ 01: ఎయిడ్స్ మహమ్మారిని తరిమేద్దామని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో జయలక్ష్మి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా గురువారం ప్రభుత్వ దవాఖాన ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు.
ఎయిడ్స్ వచ్చిన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎయిడ్స్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డాక్టర్ జయప్రకాశ్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, ఆప్తాల్మిక్ ఆఫీసర్ శ్రీహరి, ఫార్మాసిస్ట్ ఉదయ్, హెల్త్ సూపర్వైజర్లు మెర్లిన్, అమృత, ఏఎన్ఎంలు, ఆశలు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో
షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వ హించారు. ఎయిడ్స్ మహ మ్మారిని తరివేద్దాం సమాజాన్ని కాపాడుదాం అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భాను ప్రకాశ్, అధ్యాపకులు రాజ్కుమార్, శ్రీలత, శ్రీనివాస్, గౌరమ్మ, అనురాధ, సుభాశ్ పాల్గొన్నారు.
ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన
శంకర్పల్లి : ఎయిడ్స్ వ్యాధిపై విద్యార్థులకు చిన్నతనం నుంచే అవగాహన ఉండాలని లిటిల్స్టార్ హైస్కూల్ కరస్పాంటెండెంట్ సంజీత్ కుమార్ అన్నారు. ఎయిడ్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్వర్ణలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.