నందిగామ : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకి టీఆర్ఎస్ అండగా ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గోదకృష్ణ కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. కృష్ణకు టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఉండటంతో పార్టీ ఇన్సురెన్స్ ద్వారా మంజురైన రూ. 2లక్షల చెక్కును సర్పంచ్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణ భార్య అనితకు బుధవారం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని, అపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందన్నారు. అనిత పిల్లల చదువులకు అండగా ఉంటమని హామీ ఇచ్చారు. కార్యక్రమంలోమాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, ఉపసర్పంచ్ కుమార్గౌడ్ పాల్గొన్నారు.