చేవెళ్ల రూరల్, జనవరి 4 : ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదలకు మెరుగైన వైద్యం అందుతున్నదని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధి ఎన్కేపల్లి గ్రామానికి చెందిన ఎన్.రాములు కాలు విరిగిపోవడంతో చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధికి బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్రెడ్డి సహకారంతో ఎంపీ రంజిత్రెడ్డికి దరఖాస్తు చేసుకున్నారు. అందుకు సంబంధించి మంజూరైన రూ.80వేల ఎల్వోసీని ఎంపీ రంజిత్రెడ్డి బుధవారం వనం లక్ష్మీకాంత్రెడ్డితో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధి పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నదన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మాడ్గుల, జనవరి 4 : పేదలకు సీఎం సహాయ నిధి వరంలాంటిది అని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని మాడ్గుల గ్రామానికి చెందిన కోట్ల సుభద్రమ్మకు రూ.52000 సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కును బాధితురాలికి ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు ఎమ్మె శివరాజ్, పాండు, నిరంజన్ ఉన్నారు.
పేదల సంక్షేమమే సర్కారు ధ్యేయం
యాచారం, జనవరి 4 : పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మొండిగౌరెల్లి సర్పంచ్ బండిమీది కృష్ణ అన్నారు. గ్రామానికి చెందిన ఎట్టి జాపాల లక్ష్మమ్మ ఇటివలే అనారోగ్యానికి గురై ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించుకున్నది. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చొరవతో సీఎం సహాయ నిధి కింద రూ. 60,000 చెక్కును ఆయన బుధవారం బాధితురాలికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిషన్రెడ్డి సహకారంతో ఎంతో మందిని సీఎంఆర్ఎఫ్ ఆదుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల జంగయ్య, శివలింగం, సాయిలు, శ్రీనివాస్, వెంకటయ్య, కొండల్ పాల్గొన్నారు.