రంగారెడ్డి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): గత కొన్ని రోజులుగా అనా రోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు కళా తపస్వి కే.విశ్వనాథ్ గురు వారం రాత్రి తుది శ్వాస విడవటం బాధాకరమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి అన్నారు.
విశ్వనాథ్ మృతికి ఎంపీ సంతాపం వ్యక్తం చేశారు. కమర్షియల్ హంగులతో రూపొందితేనే సినిమాలు మంచి విజయం సాధిస్తాయని భావించిన వారందరికీ.. కే విశ్వనాథ్ తన కథలతో, సినిమాలతో అది తప్పని నిరూపించారని అన్నారు.