బీఆర్ఎస్తోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యపడుతుందని బీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీలకు అతీతంగా బీసీలు ఏకమై విజయమే లక్ష్యంగా అడుగులు వేయాలని కోరుతున్నారు. పార్లమెంటులో బడుగు బలహీన వర్గాల గొంతుక వినబడాలంటే కాసానిని గెలిపించుకుని తీరాలని బీసీ సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీసీలు సంఘటితం కాకపోతే.. మున్ముందు మరింతమంది నాయకులు కాంగ్రెస్ నేత మోహన్రెడ్డిలాగే అహంకారపూరితంగా మాట్లాడతారని బీసీ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
కులహంకారంతో మాట్లాడుతున్న నేతలకు వత్తాసు పలికితే రాబోయే రోజుల్లో బీసీ వర్గాలకు ఎదురయ్యే పరిస్థితులు ఇప్పుడే కండ్ల ముందర కదలాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన ఓట్లు మనమే వేసుకుందాం.. అనే నినాదాన్ని అన్ని గ్రామాలకు, బీసీ కులాలకు చేరేటట్లు చేసి మేల్కొలుపుదామని చెబుతున్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే నేతలకు ఈ ఎన్నికల్లో వేసే ప్రతి ఓటు చెంపపెట్టులా ఉండాలన్నారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ)బీసీల సత్తా చూపిస్తాం..
చేవెళ్ల పార్లమెంట్ గడ్డపై గులాబీ జెండాను ఎగురవేద్దాం. బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించి ఎంపీగా పార్లమెంట్కు పంపుదాం. బీసీల ఏకైక గొంతుకైన కాసానికి ప్రతి బీసీ మద్దతుగా నిలువాల్సిన అవసరం వచ్చింది. అయన చేసిన పోరాటాల ఫలితంగా ఎంతో మంది బీసీలు ఆర్థికంగా ఎదిగారు.
– హుస్సేన్, బషీరాబాద్
బీసీలంతా ఒక్కటయ్యే మంచి అవకాశం వచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి బీసీ అయిన కాసాని జ్ఞానేశ్వర్ను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి దింపడంతోనే దాదాపు గెలుపు ఖాయమైంది. బీసీలంతా ఒక్కటైతే కాసానికి భారీ మెజార్టీ వస్తుంది. ఈ అవకాశం మళ్లీ రాదు.
– సునీల్ప్రసాద్, బషీరాబాద్
చేవెళ్ల పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకుందాం. బీసీల బలం.. ఐక్యతను నిరూపించుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. బీసీలు ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా బీసీ నేతను గెలిపించుకుందాం. బీసీలు ఎక్కువ జనాభా ఉన్న మనలో ఐక్యత లేకపోవడంతో ప్రజాప్రతినిధులుగా ఎదగలేకపోతున్నాం.
– రాజశేఖర్, మోత్కుపల్లి, మొయినాబాద్
బీసీలు చట్ట సభల్లో ఎంత ఎక్కువ మంది ఉంటే అంత బీసీలకు మేలు జరుగుతుంది. బీసీ జనాభా ఎక్కువగా ఉన్నా బీసీలకు రావాల్సిన హక్కులు అందడంలేదు. అన్ని బీసీ సంఘాలు ఏకమై బీసీ నేతను ఎన్నుకుందాం. దీంతో ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలు సక్రమంగా అందుతాయి. బీసీలంతా మేలుకోవాలి.
– అరుణ్కుమార్, మత్స్య సహకార సంఘం ప్రధాన కార్యదర్శి, ఎన్కేపల్లి, మొయినాబాద్
ఏ పార్టీలు బీసీలకు కల్పించని అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ కల్పించారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని బీసీలందరూ ఒక్కతాటిపైకి వచ్చి ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు ఓటు వేసి గెలిపించుకునే అవకాశం వచ్చింది. ఢిల్లీలో బీసీ వాదం వినిపించేలా అధిక మెజార్టీనిస్తాం. జ్ఞానేశ్వర్ గెలుపునకు బడుగు, బలహీన వర్గాలకు చెందిన మేధావులు, విద్యావంతులు, యువకులు ఏకమౌతున్నారు.
– కరీం, రాకంచర్ల, పూడూరు మండలం
బీసీలంతా ఏకమై బీఆర్ఎస్ పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్లిన నాయకులకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సరైన బుద్ధిచెప్తాం. చేవెళ్ల ఎంపీ టికెట్ను సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్కు బీఆర్ఎస్ కేటాయించడం సంతోషం. కాసాని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంచి పేరున్న బీసీ వర్గానికి చెందిన నాయకుడు. భారీ మెజార్టీతో గెలిపిస్తాం.
– శ్రీనివాస్గౌడ్, పూడూరు మండలం
చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. బీసీ సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీసీలకు పెద్దపీట వేశారు. కాసానిని గెలిపిస్తే సామాజికంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీల్లో బడుగు బలహీనవర్గాలకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
– మధుకర్, బూచన్పల్లి, మర్పల్లి
వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్. ఎన్నో ఏండ్లుగా అగ్రవర్గాలకు చెందిన నాయకుల గెలుపు కోసం బీసీ నేతలే అహర్నిశలు శ్రమించారు. ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా బీసీ నాయకుడిని చేవెళ్ల గడ్డ నుంచి ఎంపీగా గెలిపించుకోవాలి. ప్రత్యేకంగా బీసీ నేతలు రాజకీయాలను పక్కనబెట్టి విజయమే లక్ష్యంగా పనిచేయాలి.
– వెంకటేశ్, కల్కోడ, మర్పల్లి
బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ను అఖండ మెజార్టీతో గెలిపించుకొని బీసీల ఐక్యతను ఢిల్లీలో చాటిచెప్పాలి. రాజకీయాలతో ఓట్లను చీల్చుకుని మన ఐక్యతను కోల్పోతే ఎదుటివారి ముందు పలుచన అవుతాం. ఈసారి కచ్చితంగా కాసానిని రాజకీయాలకు అతీతంగా గెలిపించుకోవాలి. లేదంటే అగ్రవర్గాల నేతల విమర్శలను చవిచూడాల్సిన పరిస్థితులు ఎల్లప్పుడూ ఉంటాయి.
– నాగేశ్యాదవ్, వట్టినాగులపల్లి
అన్ని రాజకీయ పార్టీల బీసీ నేతలు ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు రాజకీయాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో అన్ని రాజకీయ పార్టీలు మన ఓట్లను రాజకీయంగా వాడుకునేవారు. ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ ఇవ్వడం సంతోషంగా ఉన్నది. బీసీలంతా ఐకమత్యాన్ని ప్రదర్శించి కాసానిని గెలిపించుకోవాలి.
– వెంకటేశ్యాదవ్, నార్సింగి
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటేనే బీసీల పరువు దక్కుతుంది. లేదంటే బీసీలను చులకన చేసి మాట్లాడుతారు. ఇప్పటికే బీసీలకు దమ్మూ, ధైర్యం లేదంటున్నారు. బీసీలు ఒక్కటై కాసానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. మన ఓట్లు మనమే వేసుకుందామని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేద్దాం.
– నరేశ్ కుమార్, ఆరె కటిక సంఘం నాయకుడు
మన ఓట్లు మనమే వేసుకుందాం. బీసీ అభ్యర్థిని గెలిపించుకుందాం. 93 బీసీ కులాలను ఐక్యం చేద్దాం. రాజ్యాధికారం వైపు పయనిద్దాం. బీసీలకు పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారు. బీసీల గురించి మాట్లాడేవారికి గుణపాఠం చెప్పాలంటే చేవెళ్ల నుంచి బీసీ అభ్యర్థిని గెలిపించుకుందాం.
– వెంకటేశ్, రజక సంఘం నాయకుడు
బీసీలు పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థి కాసానికి ఓటు వేసి గెలిపించాలి. బీసీలందరూ ఐకమత్యంతో రాజకీయ కుట్రలను తిప్పికొట్టాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే బీసీలంటే చిన్నచూపు చూస్తున్నది. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జ్ఞానేశ్వర్కు ఓటు వేసి కాంగ్రెస్ లాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలి.
– రాణి, కృష్ణ కాలనీ
చేవెళ్ల గడ్డపై రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసానికి ఓటు వేసి గెలిపించుకుంటాం. బీసీలందరం ఐక్యతతో ముందుకు సాగి కాంగ్రెస్ పార్టీకి బీసీల సత్తా ఏంటో చూపిస్తాం. బీసీలను చిన్నచూపు చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చీరాగానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు.
– అశోక్, హఫీజ్పేట్