బీసీలను మభ్యపెట్టడం ఇంకా సాగదని.. కాంగ్రెస్ వంటి ఆధిపత్య వర్గాల పార్టీలను ఓడించే సమయం వచ్చిందని బీసీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఎక్కడ బీసీ నిలబడినా గెలిపించే బాధ్యతను బీసీలు తీసుకోవాలని బీసీ నేతలు పేర్కొంటున్నారు. బలహీనవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్సేనని.. చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో బీసీలకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరుతున్నారు.
బీసీలను అణచివేయాలన్న లక్ష్యంతో బీసీ నాయకత్వాన్ని ఎదగనీయకుండా కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో బీసీల ఐక్యత, ఓటు దెబ్బ రుచి చూపించాలని పిలుపునిస్తున్నారు. బీసీల భవిష్యత్తు బీసీల చేతుల్లోనే ఉందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచిస్తున్నారు. బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకుని బీసీ కులాల బలాన్ని చాటుదామని పిలుపునిస్తున్నారు. లేకపోతే వచ్చే ఐదేండ్లు అగ్ర కులహంకారానికి తలొగ్గి పనిచేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)
చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు.. మన ప్రాంత అభివృద్ధికి మలుపు. బడుగు, బలహీన వర్గాల గొంతుకైన జ్ఞానేశ్వర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ టికెట్ ఇవ్వడం అభినందనీయం. కులమతాలు, పార్టీలకు అతీతంగా కారు గుర్తుకు ఓటు వేసి కాసానిని గెలిపించుకోవాలి. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ జంపులు చేస్తూ ప్రజలను మోసం చేసే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఎవరూ నమ్మరాదు.
– యూనుస్, తాండూరు
96 కులాల బీసీ ఐక్య వేదికను ఏర్పాటు చేసి బీసీలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చిన చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయం. ఇప్పటివరకు చేవెళ్లలో బీసీలకు ఎంపీ టికెట్ దక్కలేదు. కేసీఆర్ బీసీలను గుర్తించి బీసీల ముద్దుబిడ్డ కాసానికి ఎంపీ అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉన్నది. కులమతాలకు అతీతంగా కారు గుర్తుకు ఓటు వేసి జ్ఞానేశ్వర్ను గెలిపించాలి.
– మోహన్, తాండూరు
చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసానిని భారీ మెజార్టీతో గెలిపించి బీసీల బలం, ఐక్యతను చాటుతాం. కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న రెండు పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెపుతారు. బీసీలందరం ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైనది.
– పెద్దోళ్ల ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల మండల అధ్యక్షుడు
బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి చేవెళ్ల అభ్యర్థి, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించి బీసీల ఐక్యతను చాటుతాం. ఇదివరకు రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూసాయి. ఇప్పుడు అలా జరుగనివ్వం. బీసీలు ఏకమై రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది.
– ఎదిరె రాములు, బీసీ సెల్ బీఆర్ఎస్ చేవెళ్ల మండల అధ్యక్షుడు
బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా చేవెళ్ల పార్లమెంటు ప్రజలకు ఒరిగేదేమీ లేదు. రంజిత్రెడ్డి గెలిస్తే రాహుల్గాంధీ భజన చేస్తారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలిస్తే మోదీ భజన చేస్తారు. బడుగు, బలహీన వర్గాల అభ్యర్థి గొంతుక పార్లమెంటులో మోగాలంటే కాసానిని భారీ మెజార్టీతో గెలిపించాలి.
– పి.అశోక్, వికారాబాద్
బీసీల ముద్దు బిడ్డ, 93 బీసీ కులాలను ఏకం చేసి బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను చేవెళ్ల ఎంపీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. కాసానిని గెలిపించుకుంటేనే తెలంగాణ రాష్ట్రం మనుగడ కొనసాగుతుంది. మన జ్ఞానేశ్వర్ గెలిస్తే చేవెళ్లలో ప్రజల సమస్యలపై పార్లమెంటులో ప్రశ్నిస్తారు.
– డి.అశోక్, పట్లూర్, మర్పల్లి
వెనుకబడిన వర్గాలంటే కేవలం రాజకీయ పక్షాలకు ఓటు బ్యాంకే కాదు. వారికీ ఆత్మాభిమానం ఉన్నది. పల్లకి మోసే సంప్రదాయానికి తెరదింపి రాజకీయంగా ముందడుగు వేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన కాసానికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వటం మాపై ఉన్న అభిమానానికి నిదర్శనం.
– పరికి నిరంజన్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు
చేవెళ్ల నియోజకవర్గంలో బీసీ వర్గానికి బీఆర్ఎస్ మినహా ఇతర ఏ పార్టీ ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజకీయానుభవం కలిగిన సీనియర్ నేత, బీసీ వర్గాల ప్రతినిధి కాసానికి టికెట్ ఇచ్చి వెనుకబడిన వర్గాల పట్ల బీఆర్ఎస్ తన చిత్తశుద్ధిని చాటుకున్నది. ఎన్నికల్లో కలిసికట్టుగా బీసీలంతా నిలిచి తమ ఐక్యత పట్ల అహంకారపూరితంగా మాట్లాడే పార్టీలకు, నేతలకు గట్టి సమాధానం చెబుతాం.
– వాలా హరీశ్రావు
చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసానిని భారీ మెజార్టీతో గెలిపించి బీసీల సత్తా చూపిస్తాం. బీసీలంతా ఒక్కటయ్యే మంచి అవకాశం వచ్చింది. బీసీలు చట్టసభల్లో ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. గతంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీల ఓట్లను వాడుకొని గెలుపొందారు. బీసీలు ఏ పార్టీలో ఉన్నా పార్టీలకతీతంగా గెలిపించుకుందాం.
– గిరినందన్గౌడ్
బీసీలంతా ఏకమై చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. బీసీల గళం ఢిల్లీలో వినిపించాలంటే బీసీలను పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాలి. చేవెళ్ల పార్లమెంట్ పరిధిపై కాసానికి అవగాహన ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒక బీసీ బిడ్డను గుర్తించి టికెట్ ఇవ్వడం సంతోషించదగ్గ విషయం.
– పబ్బు శ్రీనివాస్
బీసీల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ను బీసీలందరూ కలిసి గెలిపించాలి. గతంలో ఆయన బీసీల అభ్యున్నతి కోసం ఎంతో కృషిచేశారు. ఆయన చేసిన పోరాటాల ఫలితంగా ఎంతో మంది బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లా చైర్మన్గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు జ్ఞానేశ్వర్.
– అమరేందర్, అత్తాపూర్
జనరల్ స్థానమైనప్పటికీ చేవెళ్ల ఎంపీ సీటును బీసీ నేతకు బీఆర్ఎస్ కేటాయించడం హర్షణీయం. ఇంటింటికీ తిరిగి బీసీల మద్దతు కూడగట్టి ఆయనను గెలిపించుకుంటాం. బీసీ యువత 10 రోజులపాటు కష్టపడి కారు గుర్తుకు ఓటు వేసేలా ప్రచారం చేయాలి. బీసీ ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా చొరవ తీసుకుంటాం.
– అజయ్, హైదర్గూడ
బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా ప్రజలు అందుకునేలా మాజీ సీఎం కేసీఆర్ కృషిచేశారు. తెలంగాణ వాణిని ఢిల్లీలో వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. అన్ని విధాలుగా అనుభవం ఉన్న కాసానిని ఎంపీగా గెలిపించాలి.
– దామోదర్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్, రాంరెడ్డిపల్లి, కులకచర్ల మండలం
చాలా కాలం తరువాత చేవెళ్ల నుంచి బీసీ నేతకు అవకాశం లభించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. బీసీలకు అన్ని విధాలుగా న్యాయం జరగాలంటే బీసీ నేతను ఎన్నుకోవాలి. బీసీలకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– గండి లక్ష్మణ్, మాజీ సర్పంచ్, చాపలగూడెం, కులకచర్ల మండలం