మొయినాబాద్ : ప్రతి రెండు ఏండ్లకు ఒక్కసారి అజీజ్నగర్ గ్రామంలో బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఆర్చీలు ఏర్పాటు చేసి జాతర తరహాలో బోనాల ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. ఆదివారం మైసమ్మ బోనాల ఉత్సవాలు పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పునకాల మధ్య వైభవంగా ఊరేగింపు కొనసాగింది. బోనాల ఉత్సవాలు ప్రతి రెండు ఏండ్లకు ఒక్కసారి నిర్వహించడంతో బంధువులు, చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
గ్రామం ప్రజలతో సందడిగా మారింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలెయాదయ్య బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వారితో పాటు ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్తో పాటు స్థానిక సర్పంచ్ సంధ్య, ఎంపీటీసీ సుజాత, ఉపసర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.