షాద్నగర్టౌన్, ఏప్రిల్ 8: షాద్నగర్ పాత జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత పాటించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రహదారి విస్తరణలో భాగంగా రహదారి మధ్యలో ఉన్న మిషన్భగీరథ పైపులైన్ను సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు రహదారి విస్తరణ పనులు త్వరగా పూర్తి అయితే షాద్నగర్ పట్టణం మరింత అభివృద్ధిని సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.