తాండూరు, మార్చి 1: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తెలంగాణ సర్కార్ ప్రధాన లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం తాం డూరు పట్టణం విజయ (ఎన్టీఆర్) నగర్ కాలనీలో తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠ శాలను ఆయన ప్రారంభించారు. పాఠశాలను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల ప్రాంతంలో ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాలను తాండూరుకు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అద్దె భవనంలో ఉన్న పాఠశాలను త్వరలో ఆరు ఎకరాల స్థలంలో ఆధునిక హంగులతో నూతన భవనాన్ని నిర్మిస్తామన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువు చదువాలనే లక్ష్యంతో గురు కులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు క్రమ శిక్షణతో ఉంటూ చక్కగా చదువుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కటి నైపుణ్యంతో విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథా లయ చైర్మన్ రాజూగౌడ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నయీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నేతలు పాల్గొన్నారు.