పరిగి, జనవరి 14 : పరిగి పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లో ఆదివారం భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇంటిముందు అందగ్రామాల్లో ఘనంగా భోగి పండుగ మైన ముగ్గులు వేసి పలువురు పాలు పొంగించారు. చిన్నారులకు భోగిపండ్లు పోశారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి భోగి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా పరిగి నియోజకవర్గ ప్రజలకు ఆయన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పూడూరు : ప్రతి ఒక్కరూ భక్తి భావన కలిగి ఉండాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పూడూరు మండలం మిట్టకంకల్ గ్రామంలో గ్రామదేవత ఉత్సవాలల్లో ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, న్యాయవాది ఆనందం, సర్పంచ్ శ్యామ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ యువకులు చదువుతో పాటు దైవ భక్తిని అలవర్చుకోవాలని సూచించారు. పూజల అనంతరం గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సుధాకర్రెడ్డి, శంకరాచారి,సురేశ్, బందయ్య, శ్రీనివాస్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
దోమ : మండల పరిధిలోని దోర్నాల్పల్లి గ్రా మంలోని మైసమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయ్కుమార్రెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.