బంట్వారం, జనవరి 31: నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ పార్టీలకతీతంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని తొరుమామిడి గ్రామంలో ‘మీతోనేను’ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తొరు మామిడి ఒక్క గ్రామంలోనే రైతు బంధు కింద ఇప్పటి వరకు రూ 21 కోట్లు, రైతు భీమా కింద రూ 70 లక్షలు రైతు కుటుంబాలకు పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. గ్రామ పరిధి లో10వేల ఎకరాల వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయని, ప్రభుత్వ నిబంధనలప్రకారం ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ఉండాలన్నారు.
ఈ నేపథ్యంలో తొరు మామిడి క్లస్టర్లో మరొక క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకు సం బంధించి వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ను ఆదేశించా రు. అదే విధంగా గ్రామంలో ఉన్న నాలుగు ప్రభుత్వ పాఠశాలలు ‘మనఊరు-మన బడి’ లో ఎంపికయ్యాయని, వాటి అభివృద్ధికి గాను రూ 1.80కోట్లను వెచ్చించనున్నట్లు చెప్పారు. కాలనీల్లోని మౌలిక సదుపాయాల కొరకు రూ 20 లక్షలు ఎమ్మెల్యే నిధుల నుంచి ఇస్తు న్నట్లు ప్రకటించారు.గ్రామస్తులు ముందుకు వచ్చి స్థలం ఇస్తే వెంటనే బస్టాండ్, లేక షెల్టర్ను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 18 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ స్ఫూర్తి, కార్యదర్శి స్వప్న, ఎంపీపీ ప్రభాకర్, జడ్పీటీసీ సంతోష, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో బాలయ్య, ఎంపీవో విజయ్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ సుధాకర్గౌడ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నర్సింహులు, ఇతర నాయకులు రాములు, రాజు, వెంకటయ్య పాల్గొన్నారు.