ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 29 : నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం సీఎం సహాయనిధి పథకం ద్వారా అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.2.67లక్షల చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడలేని విధంగా నిరుపేదల వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి కింద పెద్ద మొత్తంలో ఆర్థికసహాయం అందించి ఆదుకుంటుందన్నారు.
గతంలో సీఎంఆర్ఎఫ్ ఉన్నప్పటికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదన్నారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.