పెద్దఅంబర్పేట, అక్టోబర్ 5: నియోజకవర్గంలో కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధి పెద్దఅంబర్పేట, పసుమాముల గ్రామంలో రూ.9.5 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసినట్లు చెప్పారు. అందరు సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు.
కార్యక్రమంలో చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు, కౌన్సిలర్ సిద్దెంకి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు చల్లూరి మురళీధర్రెడ్డి, రాజేందర్, హరిశంకర్, విద్యారెడ్డి, రోహిణిరెడ్డి, అర్చన, అనుపమ, అనురాధ, మణెమ్మ, పార్టీ సీనియర్ నాయకులు ఈదమ్మల బలరాం, సత్యనారాయణరెడ్డి, జగన్, దేవిడి విజయ్భాస్కర్రెడ్డి, విజయేందర్రెడ్డి, గౌని భాస్కర్, గోవర్ధనం ప్రవీణ్ పాల్గొన్నారు.
శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
పెద్దఅంబర్పేట 5వ వార్డు భువనేశ్వర కాలనీలో రూ.15 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్, పట్టణ ప్రకృతి వన, రూ.22 లక్షలతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, 6వ వార్డులో రూ.13.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, వరద నీటి కాల్వ పైపులైన్, రూ.14.5 లక్షలతో సీసీ రోడ్డు, వరద కాల్వల నిర్మాణ పనులు, 23వ వార్డు పెద్దఅంబర్పేటలోని శ్మశానవాటికలో రూ.49 లక్షల నిధులతో చేపట్టనున్న స్నానపు గదుల నిర్మాణం, 23వ వార్డు శిల్పి ఎన్క్లేవ్లో రూ.28 లక్షలతో నిర్మించిన ఎస్డబ్ల్యూడీ పైప్లైన్ పనులు, రూ.28 లక్షలతో చేపట్టిన ఎస్డబ్ల్యూడీ పైప్లైన్ పనులు, 4వ వార్డు పరిధి సాయినగర్ కాలనీ నుంచి యాదాద్రి నగర్, బ్యాంకు కాలనీ వరకు రూ.40 లక్షలతో బీటీ రోడ్డు పనులు, సాయినగర్కాలనీ ఫేజ్-2లో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు, ఫేజ్-3లో రూ.16 లక్షలతో సీసీ రోడ్డు, రూ.6 కోట్లతో పెద్దఅంబర్పేట నుంచి పసుమాముల వరకు చేపట్టనున్న యూజీడీ ట్రంక్లైన్ పనులు, 3వ వార్డు కళానగర్లో రూ.40 లక్షలతో సీసీ రోడ్లు, రూ.8 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, 2వ వార్డు పరిధి ఆంజనేయస్వామి ఆలయంలో రూ.12 లక్షలతో వేసిన బోరుమోటర్, సీసీ రోడ్డు, రూ.30 లక్షలతో శ్రీరామ్నగర్ కాలనీలో వేసిన సీసీ రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలి
యాచారం : మండలంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆయన భూ సమస్యలపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో గురువారం సమీక్షించారు. మండంలో నెలకొన్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చిన పలు భూ సమస్యలను రెవెన్యూ అధికారులకు ఫోన్ ద్వారా వివరించారు.
వీలైనంత త్వరగా రైతులెదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ధరణి అమలులోకి రాక ముందు ఉన్న పట్టా భూములు కొన్ని సీలింగ్, భూదాన్గా నమోదయ్యాయని, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్, నాయకులు చిన్నోళ్ల యాదయ్య, మారోజు శ్రీనివాస్, యాదయ్యగౌడ్, గోపాల్, ఖాజు, రైతులు తదితరులున్నారు.