పరిగి, జనవరి 22 : మున్సిపల్ పరిధిలోని వార్డుల అభివృద్ధి కి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డులో ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, సింగిల్ విండో వైస్ చైర్మన్ భాస్కర్, పార్టీ నాయ కులు ప్రవీ ణ్కుమార్రెడ్డి, కౌన్సిలర్ రవీంద్ర పాల్గొన్నారు.
కులకచర్ల, జనవరి 22 : నిమోనియా వ్యాధితో మృతి చెందిన గండిచెరువుతండాకు చెందిన విద్యార్థి అంబిక కుటుంబానికి అండగా ఉంటామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల పరిధిలోని గండి చెరువు తండాకు వెళ్లి అంబిక తల్లికి 10వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ విద్యార్థి అంబిక మృతి చెందడం బాధాకరమని, కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు.అనంతరం గోరిగడ్డతండాలో మృతి చెందిన లావు డ్యా ఓబ్యానాయక్ కుటుంబాన్ని పరామర్శించి ఐదువేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, దోమ ఎంఈవో హరిశ్చందర్, కడంపల్లి రఘు పాల్గొన్నారు.