యాచారం, జనవరి 2: పెండ్లిళ్లు చేయలేక పేదరికంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదింటి ఆడపడుచులను ఆదుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 52 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 19 మందికి సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన అనంతరం రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గిపోయాయన్నారు.
ఈ పథకం ఎంతో మంది ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మహిళా సంక్షేమం కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్నదని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళ్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరంలాంటిదన్నారు. రాష్ర్టాభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్కే సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, తహసీల్దార్ సుచరిత, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి పాచ్చ భాష, సర్పంచ్లు పాల్గొన్నారు.
పనులు త్వరితగతిన పూర్తి చేయండి
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీ పరిధి తట్టిఅన్నారం నుంచి మర్రిపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులు సకాలంలో పూర్తి చేయాల్సిందేనని, లేదంటే కాంట్రాక్టర్ పేరును బ్లాక్ లిస్టులో పెడతామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు, కౌన్సిలర్ సిద్దెంకి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు ఎమ్మెల్యే కిషన్రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తట్టిఅన్నారం – మర్రిపల్లి రోడ్డు విస్తరణ పనులు సగంలో నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజాప్రతినిధులు విన్నవించారు. స్పందించిన కిషన్రెడ్డి వెంటనే కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడి హెచ్చరించారు. పనులు వెంటనే ప్రారంభించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ప్రజాప్రతినిధులు పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో పాశం దామోదర్, చెరుకూరి జగన్, విజయేందర్రెడ్డి, నాగార్జున్రెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు.