కడ్తాల్, ఏప్రిల్ 18 : మండల కేంద్రంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈదమ్మ దేవత మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున ఈదమ్మతల్లి, మానుదాస్వామి వారి కల్యాణోత్సవం ఘనం గా నిర్వహించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఈదమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు నర్సింహ, భాస్కర్రెడ్డి, చందోజీ, వెంకటేశ్, జహంగీర్అలీ, యాదగిరిరెడ్డి, శేఖర్గౌడ్ పాల్గొన్నారు.