షాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కలిశారు. నగరంలోని ప్రగతిభవన్లో సీఎంను కలిసి ఎమ్మెల్యే రాష్ట్రంలోని దళితుల సంక్షేమానికి దళితబంధు పథకం అమలు చేయడం సంతోషకరమన్నారు. దళితబంధు పథకానికి సంబంధించి ఎస్సీ నియోజకవర్గమైన చేవెళ్లకు 100యూనిట్లు కాకుండా కొంత ఎక్కువ యూనిట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరానని ఎమ్మెల్యే తెలిపారు.