రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏప్రిల్ 3న ఆమనగల్లు మున్సిపాలిటీకి రానున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమనగల్లు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో రూ.25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారన్నారు. అదేవిధంగా 10 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఆమనగల్లు, మార్చి 27 : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏప్రిల్ 3న ఆమనగల్లు మున్సిపాలిటీకి రానున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. సోమవారం ఆమనగల్లు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆమనగల్లు మున్సిపాలిటీలో రూ.25 కోట్ల పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. శంకుస్థాపన అనంతరం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 10 వేల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి 60 వేల సభ్యత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు. అనంతరం కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఆత్మీయ సమ్మేళన వివరాలను వెల్లడించారు. కల్వకుర్తి నియోజకవర్గాన్ని ఆత్మీయ సమ్మేళన సమావేశం కోసం 17 జోన్లుగా విభజించినట్లు చెప్పారు. ఆమనగల్లు మున్సిపాలిటీ, మండల ఆత్మీయ సమ్మేళనం ఏప్రిల్ 3నే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కేటీఆర్ ప్రోగ్రాంకు సంబంధించి 6 కమిటీలు వేసారు.
ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్పై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలిస్తే స్వీకరిస్తామన్నారు. రాష్ట్రంలో ఎవరెన్ని పాదయాత్రలు చేసినా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని.. పార్లమెంట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్రం తరఫున ప్రజాప్రతినిధులు అడిగితే కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడంలేదన్నారు. సమావేశంలో జడ్పీటీసీ అనురాధ, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు పత్యానాయక్, జిల్లా గంథ్రాలయ సంస్థ డైరెక్టర్ రాధమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నారాయణ, బీఆర్ఎస్ నాయకులున్నారు.