కడ్తాల్ : అన్నాచెల్లెల, అక్కతమ్ముళ్ల అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రంతో పాటు పరిధిలోని ఆయా గ్రామాల్లో ఆదివారం రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. గాన్గుమార్లతండాలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాలకు ఆడపడుచుల రావడంతో ఇళ్లన్ని కళకళలాడాయి.