కులకచర్ల, మే 23: రామలింగేశ్వర స్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. పౌర్ణమి సందర్భంగా గురువారం మండల పరిధిలోని పాంబండ రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గిరిప్రదక్షిణ పాదయాత్ర చేశారు. భక్తుల కోరిక మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ చేయడం గొప్పనిర్ణయమని అన్నారు. గతంలో తాను జడ్పీటీసీగా ఉన్న సమయంలోనే పలు అభివృద్ధి పనులు నిర్వహించామని తెలిపారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాద్రావు, బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్న ఈశ్వరప్ప, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకురాలు జయశ్రీ, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, డీసీసీ కార్యదర్శి భీంరెడ్డి, వైస్ చైర్మన్ నాగరాజు, కులకచర్ల మాజీ సర్పంచ్ సౌమ్యావెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీ జ్యోతిశ్రీనివాస్, ఘనాపురం వెంకటయ్యగౌడ్, రాఘవేందర్గౌడ్, కామునిపల్లి నర్సింహారెడ్డి, పెంటయ్య, నర్సింహులు, హన్మంతు, శంకర్, తిర్మలాపూర్ ఎంపీటీసీ రాంలాల్, అంజిలయ్యగౌడ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బషీరాబాద్, మే 23 : మండల పరిధిలోని పర్వత్పల్లి గ్రామంలో వెలిసిన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 30వ జాతర మహోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. తాం డూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పెద్దలు, జాతర నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించారు.
మహిళలు ప్రత్యేక వంటకాలు తయారు చేసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలు, ఊరేగింపు, రథోత్సవం, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లు వెంకట్రాంరెడ్డి, అజయ్ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహులుగౌడ్, నాయకులు వెంకటేశ్ మహారాజ్, శంకర్రెడ్డి, జైపాల్రెడ్డి, మాధవరెడ్డి, శ్రీకాంత్, చందర్ పాల్గొన్నారు.