తాండూరు, డిసెంబర్ 28: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి ఎమ్మెల్యే నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దరఖాస్తు కేంద్రాల వద్ద అధికారులు, ప్రభుత్వ సిబ్బంది దరఖాస్తులను ప్రజల నుంచి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడుతూ అర్హత ఉన్నవారందరూ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులే ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. ఇందులో ఎవరు నిర్ల క్ష్యంగా వ్యవహరించిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
పెద్దేముల్: ఆరు గ్యారెంటీలు పకడ్బందీగా అమలు అయ్యేలా తానే బాధ్యత తీసుకొని ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చూస్తానని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ఖానాపూర్, చైతన్యనగర్, మంబాపూర్, కందనెల్లితాండ, కందల్లి, గొట్లపల్లి గ్రామాల్లో అభయ హస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చైతన్య నగర్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు.కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ లలిత కుమారి, ఆర్డీవో శ్రీనివాస్రావు, సర్పంచ్ లలిత, ఎమ్మార్వో కిషన్, ఎంపీడీవో లక్ష్మప్ప, జడ్పీటీసీ ధారాసింగ్, వైస్ ఎంపీపీ మధులత, సీడీపీవో రేణుక, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజూరెడ్డి తదితరులు పాల్గొన్నారు
తాండూరు రూరల్: ప్రజాపాలనలో ప్రభుత్వ పథకాలు నిరుపేదలందరకీ అందడమే ప్రభుత్వ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే మనోహార్రెడ్డి అన్నారు. గురువారం ప్రజా పాలనలో భాగంగా తాండూరు మండలం, పర్వతాపూర్లో జరిగిన సభకు హాజర య్యారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రవీందర్గౌడ్, సర్పంచ్ లాల్రెడ్డి, ఎంపీడీవో సుదర్శన్రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా మండలంలోని చింత మణి పట్టణంలో ప్రజాపాలన 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, 10 గంట లకు అధికారులు ప్రారంభించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు వస్తున్నారని, అధికా రులు ప్రజలకు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు దరఖా స్తులు చేతిలో పట్టుకొని కౌంటర్ల వద్ద ప్రజలు నిలబడి ఉన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమయానికి రాకపోవడం పై గ్రామస్తులు ఆసహనం వ్యక్తం చేశారు.
యాలాల: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సే పరమావధిగా ముందుకు వెళ్లుతుం దని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని బెన్నూరు గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ధరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామం లో 112, సంగెం కుర్దులో 269, హాజీపూర్లో 266, జక్కేపల్లిలో 197, బెన్నూరు లో 232, ముఖుందాపూర్లో 180 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర గుప్తా, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్రెడ్డి, సర్పంచ్ పటేల్ రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మప్ప, జడ్పీటీసీ ధారాసింగ్, అధికారులు పాల్గొన్నారు.
పరిగి టౌన్/పూడూరు/దోమ/కులకచర్ల : అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా గురువారం పరిగి మండల పరిధిలోని బర్కత్పల్లి, మల్లేమోనిగూడ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అలాగే పూడూరు, దోమ, కులకచర్ల, చౌడాపూర్ మండల కేంద్రాల్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు.
ఇప్పటికే రెండు గ్యారెంటీ పథకాలు అమలులోకి వచ్చాయని, మిగతా పథకాలను అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో ప్రజాపాలన పేరిట అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. పరిగి మండల పరిధిలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీపీ అరవింద్రావు, జడ్పీటీసీ హరిప్రియారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్కుమార్, ఎంపీడీవో శేషగిరిశర్మ, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, సర్పంచ్ రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. పూడూరులో జరిగిన కార్యక్రంలో డీపీవో తరుణ్, ప్రత్యేక అధికారి సుధారాణి, ఎంపీడీవో, ఉమాదేవి, ఎంఆర్వో రమాదేవి, సర్పంచ్ నవ్యారెడ్డి, జడ్పీటీసీ మేఘమాల, సొసైటీ చైర్మన్ సతీష్రెడ్డి, ఎంపీటీసీ సల్మాబేగం తదితరులు పాల్గొన్నారు. కాగా పూడూరు గ్రామస్తులు దామగుండం ప్రాంతంలో నేవి సిగ్నల్ రాడర్ ఏర్పాటును రద్దు చేసేలా చూడాలని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దీంతో ఆయన స్పందిస్తూ ప్రస్తుతం ఆ పనులను రద్దు చేసే పరిస్థితులు లేవని, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని సూచించారు.
రాడార్ ఏర్పాటుకై కొంత డబ్బులు సైతం ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. దోమ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంంలో ఎంపీపీ అనసూయ, సర్పంచ్ రాజిరెడ్డి, కోఆప్షన్ ఖాజపాషా, డీపీవో తరుణ్, ఎంపీడీవో జయరాం,గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు పంచాయితీ కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కులకచర్లలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, కులకచర్ల సర్పంచ్ సౌమ్యావెంకట్రాంరెడ్డి, ఉపసర్పంచ్ పాండురంగయ్య, మండల ప్రత్యేక అధికారి సరళాదేవి. ఎంపీడీవో నాగవేణి, తహసీల్దార్ మురళీధర్, ఎంపీటీసీ ఆనందం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చౌడాపూర్ మండలంలో నిర్వహించిన కార్యక్రమం లో తహసీల్దార్ ప్రభు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్, సర్పంచ్ కొత్త రంగారెడ్డి పాల్గొన్నారు.
పరిగి: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు గురువారం నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతి మండలంలో రెండు టీంలు ఏర్పాటుచేయగా కొన్నిచోట్ల మూడు టీంలు ఏర్పాటు చేశారు. పరిగి నియోజకవర్గంలోని పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, చౌడాపూర్ మండలాల్లో పలు గ్రామాలలో గురువారం ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించారు. ప్రధానంగా ప్రజాపాలన ద్వారా దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినా సరిపడ ఉద్యోగులు లేకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకేపీ వారిని సైతం ప్రత్యేక కౌంటర్లలో కూర్చొబెట్టి దరఖాస్తులు స్వీకరించారు. ఇచ్చిన దరఖాస్తుకు రసీదు ఇచ్చినా, ఆన్లైన్ తర్వాత చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. సదరు లబ్దిదారు చేసుకున్న దరఖాస్తు ఏ దశలో ఉన్నది తెలియపరిచే అంశాలేవి అధికారులు చెప్పడం లేదు.
ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు స్వీకరించి రసీదులు అందజేశారు. కొన్నిచోట్ల గత రాత్రి ఇంటింటికి దరఖాస్తు ఫారాలు అందడంతో వాటిని పూర్తి చేసిన వారు ప్రత్యేక కౌంటర్లలో అందజేశారు. పరిగి మున్సిపాలిటీకి సంబంధించిన 15 వార్డులలో గురువా రం ప్రజాపాలన ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఇందుకు సంబంధించి ఆయా వార్డులలో ఎంపిక చేసిన స్థలాల్లో ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేయాల్సి ఉం డగా కొన్నిచోట్ల ఉదయం 10గంటల వరకు కనీసం టెంట్లు వేయకపోవడంతో సిబ్బంది ఆరు బయటే కూర్చున్నారు.
ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులే తీసుకుంటుండగా తమకు రేషన్కార్డు లేదని, కార్డులు కావాలని పలువురు పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలు సరిపోని స్థలాల్లో జిరాక్స్ తీసి అందజేశారు. పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 3, 15 వార్డులలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ దరఖాస్తులు స్వీకరించారు. ఇచ్చిన ప్రతి దరఖాస్తుకు రసీదు అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, కౌన్సిలర్ వేముల కిరణ్, కో-ఆప్షన్ సభ్యులు ముకుంద శేఖర్, ముజమిల్, బీఆర్ఎస్ నాయకులు రవికుమార్ పాల్గొన్నారు.
బొంరాస్పేట: అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించ డానికే ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తున్నదని మండల ప్రత్యేకాధికారి రాంరెడ్డి అన్నారు. గురువారం బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. దుద్యాల మండలంలోని గౌరారంలో నిర్వ హించిన ప్రజా పాలన గ్రామసభలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ పాల్గొన్నారు. దర ఖాస్తుల స్వీకరణ తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. బొం రాస్పేట మండలంలోని మెట్లకుంట, బుర్రితండా, సాలిండాపూర్, టేకులగడ్డతండా, ఎన్నెమీది తండా(కొత్తూరు), ఎన్నెమీదితండా(వడిచెర్ల), దుద్యాల మండలం గౌరారం, సాగారం తండాల్లో గ్రామ సభలు నిర్వహించారు. వంద మందికి చొప్పున కౌంటర్లు ఏర్పా టు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రెండు మండలాల తహసీల్దార్లు వెంకటేశ్, దానయ్య, ఎంపీడీవో వెంకన్గౌడ్, అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
వికారాబాద్: వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్, మున్సిపల్, మోమిన్పేట, మర్పల్లి, నవాబుపేట, ధారూరు మండలాల్లోని ప్రత్యేక అధికారులు ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వికారా బాద్ మండలం సిద్దులూర్ గ్రామంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని 2 వార్డు ధన్నా రంలో మున్సిపల్చైర్పర్సన్ మంజుల ప్రారంభించారు. నవాబుపేట మం డలంలో అక్నాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు. ప్రజాపాలన ద్వారా దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినా సరిపడ ఉద్యోగులు లేక పోవడంతో ఆర్పీలతో, ఫీల్డ్ అసిస్టెంట్లతో ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. దరఖాస్తు ఫారాలను ప్రజలకు అందజేసే సమయంలో వారికి అవగాహన కల్పించలేకపోయారు. దరఖాస్తుకు రసీదు ఇచ్చినా, ఆన్లైన్ తర్వాత చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
సదరు లబ్దిదారు చేసుకున్న దరఖాస్తు ఏ దశలో ఉన్నది అనే విషయం తెలియపరిచే అంశాలేవి అధికారులు చెప్పడం లేదు. కొన్నిచోట్ల గత రాత్రి ఇంటింటికీ దరఖాస్తు ఫారాలు అందడంతో వాటిని పూర్తి చేసిన వారు ప్రత్యేక కౌంటర్ల లో అందజేశారు. కొన్ని గ్రామాల్లో అదే రోజు గ్రామ పంచాయతీ కార్యా లయం నుంచి దరఖాస్తు ఫారాలు పంపిణీ చేశారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులే తీసుకుంటుండగా తమకు కొందరు గ్రామస్తులు రేషన్కార్డు లేదని, కార్డులు కావాలని పలువురు పేర్కొన్నారు. సిద్దులూర్ గ్రామానికి సరైన బస్సు సౌకర్యం లేక మహిళలు ఇబ్బందులు పడుతు న్నారని మండల ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకొచ్చారు. ఆటోలో ప్రయాణించాలంటే 10 మంది వరకు ఎక్కితే గాని ప్రయాణం సాగదని, ఉచిత బస్సు సౌకర్యం మాకు కల్పించాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చా రు. దరఖాస్తు ఫారాలు సరిపోని స్థలాల్లో జిరాక్స్ తీసీ అందజేశారు.
కొడంగల్: మున్సిపల్ పరిధిలోని 1వ, 2వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, వైస్ చైర్పర్సన్ ఉషారాణితో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మండలంలోని పోచమ్మతండాలో, ప్యాలమద్ది, హుస్సేన్పూర్ గ్రామాల్లో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్తో పాటు అధికారులు దరఖాస్తుల స్వీరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మండలంలోని పోచమ్మతండాలోని ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని గిరిజనులకు ప్రజాపాలనలో స్వీకరిస్తున్న గ్యారెంటీ పథకాల దరఖాస్తుపై అవగాహన కల్పించారు.
ప్రజా పాలన కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో 1వ వార్డులో 185, 2వ వార్డులో 200పోచమ్మతండాలో 127, ఖజాఅహ్మద్పల్లిలో 160, ప్యాలమద్ది 114, హుస్సేన్పర్లో 127 ధరఖాస్తులు అందుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయకుమార్, ఎంపీడీవో పాండులతో పాటు సర్పంచ్లు అంజప్ప, శంకర్నాయక్ పాల్గొన్నారు.
దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలంలోని బండివాడ, ర్యాలగుట్ట తండా, లొట్టిగుంట తండా నంద్యానాయక్ తండా గ్రామ పంచాయతీల్లో ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. బండివాడ -44, ర్యాలగుట్ట తండా-96, లొట్టిగుంట తంగా-153, నంద్యానాయక్ తండా-155 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమాలకు ప్రత్యేకాధికారులుగా తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో తిరుమలస్వామి, ఎంపీవో రవీందర్ నిర్వహించారు.