కొత్తూరు, సెప్టెంబర్ 21: ప్రతి గల్లీని సీసీ రోడ్డుగా మార్చి మున్సిపాలిటీ రూపురేఖలను మారుస్తామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో 228.56 కోట్లు, 3వ వార్డులో 227.30 కోట్లలో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడారు. కొత్తూరు మున్సిపాలిటీలో ప్రతి వార్డులో తిరిగి అక్కడ రోడ్ల పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నానని చెప్పారు. దీంతో ఏ వార్డుకు ఎన్ని రోడ్లు అవసరమో గుర్తించి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశామని వివరించారు. మున్సిపాలిటీలో రోడ్లు, అండర్ డ్రైనేజీలకు రూ. 32 కోట్లు కేటాయించామని చెప్పారు. కేవలం 12 వార్డులున్న మున్సిపాలిటీ అభవృద్ధికి ఇంతపెద్ద మొత్తంలో నిధులు కేటాయించినందుకు మున్సిపల్ మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, 2వ వార్డు కౌన్సిలర్ కొస్గి శ్రీనివాసులు, 3వ వార్డు కౌన్సిలర్ చంద్రకళ, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, దేవేందర్యాదవ్, జనార్దన్రెడ్డి, యాదయ్య, ఇన్స్పెక్టర్ శంకర్రెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
నందిగామ : అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు గురువారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర రాష్ర్టాల ప్రజలు సైతం తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తమ రాష్ర్టాల్లో కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు అశోక్, రాజ్గోపాల్, మాజీ చైర్మన్ విఠల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచ్లు అశోక్, జట్ట కుమార్, చంద్రరెడ్డి, రాజు, రమేశ్గౌడ్, అనిత, ఎంపీటీసీ రాజునాయక్, కో ఆప్షన్ మెంబర్ బేగ్ పాల్గొన్నారు.