షాద్నగర్, డిసెంబర్ 18: రాష్ట్రంలోని ప్రతి పేద దళిత కుటుంబం ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీలో దూస్కల్కు చెందిన లబ్ధిదారుడు సంకెపల్లిగూడెం యాదయ్య దళితబంధు పథకం ద్వా రా ఏర్పాటు చేసుకున్న ఎలక్ట్రికల్ షాప్ను ఎమ్మెల్యే ఆదివా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. దళితబంధు ద్వారా పేదలకు రూ. 10 లక్షలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. దళిత బంధు ద్వారా పెట్టుకునే యూనిట్ను సరైన మార్గంలో వృద్ధి చేసుకోవాలని సూచించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అర్హులైన ప్రతి దళితుడికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని వివరించారు.
రైతు బీమా ప్రొసీడింగ్ అందజేత
రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబం ఆర్థిక చేయూత అందించేందుకు రైతుబీయా పథకాన్ని తెచ్చామని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీ 11వ వార్డుకు చెందిన సయ్యద్ తాహిరుద్దీన్ అనే రైతు మరణిస్తే ఆయన కుటుంబానికి రైతు బీమా పథకం వర్తించిందని తెలిపారు. రైతు భార్య మసుదా బేగంకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ రూ. 5 లక్షల ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అగ్గనూరు విశ్వం, బీఆర్ఎస్ నాయకులు జమ్రుత్ఖాన్, రఘుమారెడ్డి, జూపల్లి శంకర్, ప్రసాద్ పాల్గొన్నారు.
అన్నదానం ఎంతో పుణ్యం
షాద్నగర్రూరల్ : అయ్యప్ప మాల దీక్షపరులకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని శ్రీశివమారుతీ గీతా అయ్యప్ప మందిరంలో 21వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ అయ్యప్ప స్వాములకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఆయన హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, అయ్యప్పసేవా సమితి సభ్యులు కౌన్సిలర్ నందీశ్వర్, శేఖర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఎస్బీపల్లిలో ఎమ్మెల్యే పర్యటన
కొత్తూరు, డిసెంబర్ 18: మండల పరిధిలోని సిద్దాపూర్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సోమవారం పర్యటిస్తారని జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్బీపల్లి నుంచి కొత్తపేట వరకు గల రెండు వైపులా బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ఎస్బీపల్లిలోని పోచమ్మగుడి వద్ద ఉదయం పది గంటలకు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి మండలంలోని ప్రజాపతినిధులు, నాయకులు హాజరవ్వాలన్నారు.
కేశంపేట : కేశంపేట మండలంలో సోమవారం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పర్యటించనున్నట్లు మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్ తెలిపారు. మండల కేంద్రంలో క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తారని, నిర్దవెళ్లిలో మైనార్టీల ఫంక్షన్ హాల్కు భూమి పూజ నిర్వహిస్తారని తెలిపారు. మండల మహిళా సమాఖ్యలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలను పంపిణీ చేస్తారన్నారు. వేములనర్వలో శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే స్వామి వారి కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపారు.