బషీరాబాద్, పిబ్రవరి 27 : పోస్టాఫీస్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. సబ్ పోస్టుమాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై విద్యాచరణ్రెడ్డి కథనం ప్రకారం..మండల కేంద్రంలోని పోస్టు ఆఫీస్లో సబ్ పోస్టుమెన్గా విధులు నిర్వహిస్తున్న పరమేశ్వర్ శని వారం సాయంత్రం విధులు ముగించుకుని పోస్టాఫీస్కు తాళాలు వేసి వెళ్లి పోయాడు.
సోమవారం ఉదయం వచ్చి తాళాలు తీసి లోపలికి వెళ్లాడు. అయితే అతడి టేబుల్పై ఉన్న క్యాష్ కౌంటింగ్ మిషన్, ప్రింటర్ కని పిం చకపోవడంతో లోపలి గదిలోకి వెళ్లి చూడగా అక్కడ పడి ఉండటాన్ని గమనించాడు. ఆఫీసులో మిగతా వస్తువులు, డాక్యుమెంట్స్, పాలసీలకు సంబంధించిన రికార్డులు ఉన్నాయా లేదని తనిఖీ చేసుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి వచ్చినట్లు గుర్తించి, పై అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చే య డంతో, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.