రంగారెడ్డి, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని మహేశ్వరం నియోజకవర్గంలోని ‘రావిర్యాల’ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి శుక్రవారం ఉదయం 8.30 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఇప్పటికే ఉదయం వేళల్లో రాగిజావను అందిస్తుండగా..మధ్యాహ్న భోజనాన్ని గుడ్డుతో పాటు అందిస్తున్నారు. ఈ రెండింటికి మధ్యలో ఇకపై అల్పాహారంగా కిచిడీ, పొంగల్, ఉప్మా వంటి వాటిని విద్యార్థులకు అందించనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని అన్ని స్థాయిల విద్యార్థులకు ఈ అల్పాహారాన్ని ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
నేడు అల్పాహారం ప్రారంభం
కడ్తాల్, అక్టోబర్ 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభించనున్నట్లు ఎంఈవో సర్దార్నాయక్, నోడల్ అధికారి జంగయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో ఉదయం 7 : 30 గంటలకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు.