రంగారెడ్డి, మే 5(నమస్తే తెలంగాణ): విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు నగరంలోని శ్రీనగర్ కాలనీ మంత్రి నివాసంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి.
మంత్రి పుట్టినరోజును పురస్కరించుకొని సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో, రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల రక్తదాన శిబిరాలను నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణుల సమక్షంలో భారీ కేక్ను కట్ చేశారు.