ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండో విడుత కంటి వెలుగు పండుగ షురూ అయ్యింది. గురువారం మహేశ్వరం నియోజకవర్గంలో పలుచోట్ల మంత్రి సబితారెడ్డి కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే ఆయా నియోజకర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో మొదటి రోజు మొత్తం 7,894 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో వివిధ సమస్యలున్న 1390 మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. మరో 1,890 మందికి సమస్యకు అనుగుణంగా ప్రిస్క్రిప్షన్పై కంటి అద్దాలను ఆర్డర్ చేశారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 42 శిబిరాలు ఏర్పాటు చేయగా తొలిరోజు 5,585 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1077 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేయగా, మరో 838 మందికి ప్రిస్క్రిప్షన్పై కంటి అద్దాలను ఆర్డరిచ్చారు. ఇవి 15 రోజుల్లోగా ఆయా పీహెచ్సీలకు చేరనుండగా, లబ్ధిదారులకు అందజేయనున్నారు.
వికారాబాద్, జనవరి 19(నమస్తే తెలంగాణ): రెండో విడుత ‘కంటి వెలుగు’ గురువారం జిల్లాలో ప్రారంభమైనది. ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, కలెక్టర్ ప్రారంభించారు. తాండూరు పట్టణంలోని బస్తీ దవాఖానలో ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో కలిసి కలెక్టర్ నిఖిల కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. అదేవిధంగా కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంపును కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డితో కలిసి.. పూడూరు మండలం లోని చన్గొముల్ పీహెచ్సీలోని శిబిరాన్ని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డితో కలెక్టర్ నిఖిల ప్రారంభించి, పలువురికి కంటి అద్దాలను పంపిణీ చేశా రు. అదేవిధంగా వికారాబాద్ మున్సిపాలిటీలోని 31వ వార్డులో.. ధారూరు మండల కేంద్రంలోని కంటి వెలుగు శిబిరాలను వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రారంభించా రు. అయితే జిల్లాలో ఏర్పాటు చేసిన 42 కంటి వెలుగు కేంద్రాల్లో మొదటి రోజు 5,585 మం దికి పరీక్షలు చేసి 1,077 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. కాగా మరో 838 మందికి దూరపు, దగ్గరి కంటి సమస్య ఉందని గుర్తించి, ప్రిస్క్రిప్షన్ కంటి అద్దాలను పంపిణీ చేసేందుకు కంటివెలుగు శిబిరాల్లోనే వైద్యులు ఆర్డర్ చేశారు. ఆధార్ కార్డుల ద్వారా వివరాల ను సేకరించిన వైద్య సిబ్బంది, ప్రత్యేకంగా ఒక్కొక్కరికీ బార్కోడ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రిస్క్రిప్షన్ అద్దాలు 15 రోజుల్లోగా ఆయా పీహెచ్సీలకు చేరనున్నాయి. బార్కో డ్ ఆధారంగా వాటిని పం పిణీ చేయనున్నారు.
రాష్ట్రంలో అంధత్వాన్ని నిర్మూలించేందుకు సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి సబితారెడ్డి అన్నారు. గురువారం ఆమె జిల్లెలగూడలోని అంబేద్కర్నగర్బస్తీలోని అంబేద్కర్ భవనంలో.. బడంగ్పేటలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమా ర్, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని.. మొదటి విడుత చేపట్టిన కార్యక్రమం జయప్రదం కాగా.. కోటీ50 లక్షల మందికి కంటి పరీక్షలు చేసి.. అద్దాలను పంపిణీ చేయడంతోపాటు అవసరం ఉన్న వారికి ఆపరేషన్లను కూడా ప్రభుత్వం చేయించిందన్నారు. గురువారం నుంచి రెండో విడుత కార్యక్ర మం ప్రారంభమైందన్నారు. జిల్లాలో 80 బృందాలను ఏర్పాటు చేసి అందరికీ కంటి పరీక్షలు నిర్వహించేలా చర్య లు తీసుకుంటున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలన్నారు. ఇంత మంచి కార్యక్రమం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు రావడం లేదన్నారు. ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
రంగారెడ్డి జిల్లాలో 7,894 మందికి పరీక్షలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటివెలుగు కార్యక్రమానికి మొద టి రోజు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. రంగారెడ్డి జిల్లాలో గురువా రం 7,894 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసి న 80 బృందాలతో 37 పీహెచ్సీల పరిధిలో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభమయ్యాయి. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేటలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించగా… చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు నియోజకవర్గా ల్లో స్థానిక ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, మంచిరెడ్డి కిషన్రెడ్డి, జైపాల్యాదవ్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం, తులేకలాన్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ అమయ్కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ సందర్శించి పరిశీలించారు. అక్కడు న్న సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కంటి పరీక్షలు చేసిన వైద్యులు అవసరమున్న వారికి అద్దాలు, మందులు పంపిణీ చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగ ల్లు, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లోని 37 పీహెచ్సీల పరిధిలో ఏర్పాటు చేసిన 80 కంటి వెలుగు కేంద్రాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొదటి రోజు జిల్లాలో 7,894( మహిళలు 3,471 మంది, పురుషులు 4,423) మందికి వైద్యులు పరీక్షలు చేయగా.. 1,3 90 మందికి కంటి సమస్యలున్నట్లు గుర్తిం చి అద్దాలు పంపిణీ చేశారు. మరో 1,890 మందికి కంటి అద్దాలు త్వరలో అందించనున్నట్లు అధికారులు తెలిపారు. 4,614 మందికి ఎలాంటి సమస్యలు లేవన్నారు.
పేదల కంటి వెలుగు సీఎం కేసీఆర్..
ఉచితంగా కంటి పరీక్షలు చేయిస్తూ సీఎం కేసీఆర్ పేదల కంటి వెలుగైండు. ఈ కార్యక్రమం పేదలకు వరం లాంటిది. కంటి చూపు సమస్యలున్నా దవాఖానలకు వెళ్లే ఆర్థిక స్థోమత లేక చాలామంది బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని సాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి, ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు, మందులు పంపిణీ చేస్తుండటం చాలా సంతోషకరం. ప్రజలందరి తరఫున సీఎం సార్కు కృతజ్ఞతలు.
-పాండు, బుద్లాపూర్, దోమ మండలం
ప్రభుత్వానికి రుణపడి ఉంటా..
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు మా ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పేదల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నది. ప్రస్తుతం చాలా మందికి చిన్నతనం నుంచే కంటి సమస్యలొస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కంటి సమస్యలను పరిష్కరించేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉన్నది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వానికి రుణపడి ఉంటా.
-కళమ్మ, ఎలికట్ట గ్రామం, షాద్నగర్ రూరల్
స్పష్టంగా చూడగలుగుతున్నా..
నాకు దగ్గరగా ఉన్న ఏ వస్తువు కూడా స్పష్టంగా కనిపించదు. చాలా రోజులుగా కంటి దవాఖానలో చూపించుకుంటున్నా ఫలితంలేదు. సీఎం కేసీఆర్ పుణ్యమా అని ‘కంటి వెలుగు’లో భాగంగా ఈ రోజు మా గ్రా మంలో ఏర్పాటు చేసిన క్యాంపులో పరీక్షించిన వైద్యు లు దగ్గరి చూపు సమస్య ఉందని తేల్చి కంటి అద్దాలు ఇచ్చారు. అవి పెట్టుకున్నప్పటి నుంచి దగ్గరి వస్తువులు స్పష్టంగా చూడగలుగుతున్నా.
– మద్ది శాంతయ్య, గూడూరు, కొత్తూరు మండలం
అన్ని వస్తువులు కనిపిస్తున్నాయి..
ఎన్నో ఏండ్లుగా కంటి సమస్యతో బాధపడుతున్నా. ఆర్థిక పరిస్థితి సహకరించక పోవడంతో చూపించుకోలేదు. ‘కంటివెలుగు’లో భాగంగా మా గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాంపులో పరీక్షించిన వైద్యులు కంటి అద్దాలు ఇచ్చారు. ఇప్పుడు అన్ని వస్తువులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉచితంగా కంటి అద్దాలు ఇచ్చిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
-చంద్రకళ, అబ్దుల్లాపూర్మెట్
ఇది మంచి కార్యక్రమం
తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులిస్తూ ఆదుకోవడం హర్షణీయం. తాను కూడా మా గ్రా మంలో ఏర్పాటు చేసిన శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకుని.. కొత్త అద్దాలను తీసుకోవడంతో కండ్లు మంచిగా కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం చాలా మంచిది.
-శంకరయ్య, జేఎన్ఎంఆర్ కాలనీ, ఇబ్రహీంపట్నం
అద్దాలు తీసుకోవడం సంతోషంగా ఉంది..
కంటి వెలుగు కార్యక్రమంలో కొత్త అద్దాలు తీసుకున్నా. నాకు 80 ఏండ్లు దాటాయి. దూరం చూపు ఇబ్బందిగా ఉంది. ‘కంటి వెలుగు’లో పరీక్షించిన వైద్యులు ఉచితంగా అద్దాలు, మందులు ఇచ్చారు. ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా అద్దాలు అందుకున్నా. పేదలకు ఈ కార్యక్ర మం చాలా ఉపయోగంగా ఉంటుంది.
-సంగెం బాలయ్య, ఎన్కెపల్లి, బొంరాస్పేట, కొడంగల్
వృద్ధులకు ఎంతో ప్రయోజనకరం..
కంటి పరీక్షలు చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నది. అందువల్ల చాలామంది పేదలు కంటి పరీక్షలు చేయించుకోకుండా ఉన్న చూపుతోనే సర్దుకుపోతుంటారు. వృద్ధులకు ఈ కంటి వెలుగు కార్యక్రమం ఎంతో ప్రయోజనకరం. క్యాంపులోని వైద్యులు సంతోషంగా కంటి పరీక్షలు చేస్తూ అవసరం ఉన్న వారికి అద్దాలు, మందులను పంపిణీ చేస్తున్నారు.
-కూరగాయల భారతయ్య, కొడంగల్
నాకు అద్దాలిచ్చారు..
సీఎం కేసీఆర్ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. కంటి సమస్యలు ఉన్న వారికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. ‘కంటి వెలుగు’లో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాంపులో పరీక్షించిన వైద్యులు నాకు అద్దాలను పంపిణీ చేశారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-ఎం. అమ్రీబాయి, గ్రామం రేళ్ల్లగడ్డతండా, యాలాల మండలం
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
పేదలు, వృద్ధులకు ‘కంటి వెలుగు’ ద్వారా కంటి అద్దాలు అందించడం అభినందనీయమం. నిరుపేదలైన తమకు కంటి అద్దాలు అందించి ప్రభుత్వ ఆదుకుంటున్నది. కంటి పరీక్షలు చేయించుకునేందుకు దూరప్రాంతాలకు వెళ్లే ఆర్థి క స్థోమత లేని నాలాంటి వారికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-బాలయ్య, కులకచర్ల
ఆనందంగా ఉంది
తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు ద్వారా కంటి అద్దాలు అందించడం చాలా ఆనందంగా ఉంది. వృద్ధాప్యంలో పింఛన్తోపాటు.. దూరం చూపు, కంటి సమస్య లున్నా మాకు ఉచితంగా గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేసి పరీక్షలు చేసి అద్దాలు పంపిణీ చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-లక్ష్మయ్య, కులకచర్ల
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేయడం అభినందనీయం. పేదలు, మధ్య తరగతి వారికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. గ్రా మంలో ఏర్పాటు చేసిన శిబిరంలో వైద్యులు పరీక్షించి ఉచితంగా మందులు, అద్దాలు ఇస్తున్నారు. కంటి పరీక్షల కోసం ప్రైవేట్ దవాఖానలకు వెళ్తే రూ.వెయ్యివరకు ఖర్చు అవుతుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సీఎంకు ధన్యవాదాలు.
‘కంటి వెలుగు’తో ఎంతో మేలు..
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంతో మాలాంటి వారికి ఎంతో మేలు జరుగుతున్నది. ప్రైవేట్ దవాఖానలకెళ్లి చూయించుకునే స్థోమత లేదు. వైద్యులు గ్రామాలకే వచ్చి కంటి పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు, మందులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాకు దూరం చూపుతో కొంత ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం వైద్యులు కంటి అద్దాలు ఇవ్వడంతో ఆ సమస్య కూడా తీరునున్నది.
– మహబూబీ, ఆలూర్ గ్రామం, చేవెళ్ల మండలం
పేదల పాలిట ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్
కంటి పరీక్షలు చేయడం చాలా బాగున్నది. గతంలో ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టలేదు. సీఎం కేసీఆర్ పేద ల పాలిట ఆపద్బాంధుడిగా నిలిచారు. మాలాంటి పేదలకు ప్రైవేట్ దవాఖానలకెళ్లే ఆర్థిక స్థోమత లేదు. ప్రభుత్వం ఉచితంగా కంటి అద్దాలు, మందులు ఇవ్వడం హర్షణీయం.
-చాకలి సత్తయ్య, అంతారం గ్రామం, చేవెళ్ల మండలం