రంగారెడ్డి, డిసెంబరు 27(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్మెట్కు గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రానున్నారు. ఇక్కడి నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉప ముఖ్యమంత్రితోపాటు రెవెన్యూ, హౌజింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటలకు జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో వారు పాల్గొంటారు.