ధారూరు, డిసెంబర్ 22: మిషన్ భగీరథ తాగు నీటిలో తగిన మోతాదులో బ్లీచింగ్ పౌడర్ కలపాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. గురువారం ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా ధారూరు మండల పరిధిలోని కుక్కింద గ్రామంలో అధికారులు, ప్రజా ప్రతి నిధులతో కలిసి పర్యటించారు. గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పాడుబడ్డ ఇండ్లు, పిచ్చి మొక్కలను తొలగించి, పురాతన బావులను పూడ్చి వేయాలని పంచాయతీ కార్యదర్శి సునీతకు సూచించారు.
షుగర్, బీపీ వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ మరుగు దొడ్లు నిర్మించుకోవాలని, నిర్మించుకున్న వారందరికీ పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబందిత శాఖ అధికారుల ను ఆదేశించారు. గ్రామంలో ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మిషన్ భగీరథ నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో కొన్ని చోట్ల విద్యుత్ సమస్యలు ఉన్నాయని వాటిని త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికా రులను ఆదేశించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజూనాయక్, ప్రధాన కార్యదర్శులు కావలి అంజయ్య, రాజూగుప్తా, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు వెంక టయ్య, గామ సర్పంచ్ వీరేశం, ధారూరు గ్రామ సర్పంచ్ చంద్రమౌళి, కుమ్మరిపల్లి సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీడీవో చంద్రశేఖర్, తహసీల్దార్ భువనేశ్వర్, మండల వ్యవసాయ అధికారి జ్యోతి, యువజన విభాగం మండల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మండల చైర్మన్ సంతోశ్ కుమార్, వైస్ చైర్మన్ అంజయ్య, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, రాములు, రవికుమార్, సుధాకర్ గౌడ్, దేవేందర్, మాణిక్యం, అంజయ్య, లక్ష్మయ్య, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.