వినాయక్నగర్, ఆగస్టు 10: కరోనా వ్యాధి రాకుండా వ్యాక్సినేషన్ తీసుకోవాలని జోనల్ కమిషనర్ మమత అన్నారు. మంగళవారం వెంకటాపురం డివిజన్ ఇందిరానగర్ బస్తీలో మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ను డీసీ నాగమణితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బస్తీలు, కాలనీల ప్రజలకు ఇంటి దగ్గరలో వ్యాక్సినేషన్ అందుబాటులో పెట్టామన్నారు. వ్యాక్సినేషన్ పట్ల అపోహలు వద్దని, వ్యాక్సి నేషన్ తీసుకున్న వారికి కరోనా వ్యాధి రాకుండా రక్షణ శక్తి ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఏఎంహెచ్వో డాక్ట ర్ నిర్మల, ఈఈ రాజు, డీఈలు మహేశ్, కార్తిక్ పాల్గొన్నారు.
సికింద్రాబాద్, ఆగస్టు 10: కరోనా నివారణకు ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చిందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పల్లె మోహన్రెడ్డి కోరారు. బౌద్ధనగర్ కమ్యూనిటీహాల్, అంబర్నగర్ బస్తీదవాఖానలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
కంటోన్మెంట్, ఆగస్టు 10: బోర్డు పరిధిలోని ప్రజలకు కరోనా సోకకుండా ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. మంగళవారం కంటోన్మెంట్లోని ఏడో వార్డు న్యూ గాంధీనగర్ కమ్యూనిటీ హాల్లో నూతనంగా వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే సాయన్న ఆదేశాల మేరకు పెరుమాల్ వేంకటేశ్వర స్వామి దేవాలయ పాలక మండలి సభ్యుడు, కాలనీ అధ్యక్షుడు తేజ్పాల్ నేతృత్వంలో ప్రారం భమైన వ్యాక్సినేషన్ కేంద్రానికి బస్తీవాసులు క్యూ కట్టారు.
కంటోన్మెంట్, ఆగస్టు 10: కంటోన్మెంట్లోని రెండో వార్డులో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేస్తున్నామని బోర్డు మాజీ సభ్యుడు కేశవరెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అన్నారు. వార్డులోని అన్నానగర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. మాస్కులను పంపిణీ చేశారు. కార్య క్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, నర్సిం గ్, అశోక్, జబ్బార్, నర్సింహ, జిలానీ, మణికంఠ పాల్గొన్నారు.
వినాయక్నగర్, ఆగస్టు 10: కరోనా వ్యాధి రాకుండా ప్రజలకు వ్యాక్సినేషన్ ఇవ్వడానికి మొబైల్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం వినాయక్నగర్ డివిజన్ దీన్దయాళ్నగర్ కమ్యూనిటీ హాల్లో ప్రజలకు మొదటి డోస్ కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చారు. అనంతరం దినకర్నగర్ కాలనీలోని ఎస్ఎస్ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో టీచర్లను సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ స్నేహ, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాములు, డివిజన్ అధ్యక్షుడు ఓంప్రకాశ్, కాలనీ అధ్యక్షుడు జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.