ఉప్పల్ జోన్బృందం, జూన్ 23: నియోజకవర్గంలోని ప్రజలందరికీ కరోనా టీకా అందేలా చూస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టీకా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బుధవారం పలు ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హబ్సిగూడలోని జేఎస్ఎన్కాలనీ, చిలుకానగర్లోని జిల్లాపరిషత్ పాఠశాల, కాప్రాలోని సాయిబాబా ఆలయ ప్రాంతం, నాచారంలోని సెయింట్ పీటర్స్ పాఠశాల, హెచ్బీకాలనీలోని ఫేజ్వన్ ప్లేగ్రౌండ్, ఆనంద్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్ ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 30 ఏండ్లు పైబడిన ప్రతిఒక్కరూ టీకా తీసుకోవచ్చన్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, ఉప్పల్ సర్కిల్ డీసీ అరుణకుమారి, ఈఈ నాగేందర్, డీఈ నాగమణి, రూప, ఏఎంహెచ్వో మైత్రే యి, కార్పొరేటర్లు శాంతి, జెర్రిపోతుల ప్రభుదాస్, స్వర్ణరాజ్, చేతన, వైద్యబృందం డాక్టర్ సౌందర్యలత, డాక్టర్ స్వర్ణలత, అమితుల్ కబీర్, సంపత్, బోగ ప్రకాశ్, నేతలు శ్రీనివాస్రెడ్డి, సాయిజెన్ శేఖర్, సుధాకర్, మహేందర్రెడ్డి, గోపాల్రెడ్డి, పల్లె నర్సింగ్రావు, ప్రభాకర్రెడ్డి, కొండల్రెడ్డి, శ్రీధర్, లింగానాయక్ పాల్గొన్నారు.