మేడ్చల్, ఆగస్టు22(నమస్తే తెలంగాణ): ఉన్నత చదువులు చదివే ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్లను మంజూరు చేసింది. 2020-21 విద్యాసంవత్సరానికి మేడ్చల్ జిల్లాకు రూ. 53.79 కోట్లు కేటాయించగా, స్కాలర్ షిప్ల పంపిణీ కొనసాగుతున్నది. జిల్లావ్యాప్తంగా ఇంటర్ నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, ఎంబీఏ కోర్సుల్లో మొత్తం 23,766 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటి వరకు 15,500 మంది విద్యార్థులకు సంబంధించిన ట్యూషన్ ఫీజుల చెల్లింపులు పూర్తయ్యాయి. మరో 8,300 విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ 80 శాతం పూర్తవ్వగా, మరో 20 శాతం త్వరలోనే పూర్తి చేయనున్నారు.
మేడ్చల్ జిల్లాకు 2020-21 విద్యాసంవత్సరానికి ఎస్సీ విద్యార్థులకు స్కాలర్ షిప్లను అందించేందుకు ప్రభుత్వం రూ. 53.79 కోట్లను మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో విద్యనభ్యస్తున్న వారికి స్కాలర్షిప్లతో పాటు విద్యార్థులకు అవసరమయ్యే నిర్వహణ ఖర్చులను అందిస్తున్నాం. ప్రైవేట్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజులను ఆన్లైన్లో చెల్లిస్తున్నాం.