రామంతాపూర్, నవంబర్ 11 : పొరుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను మనందరం గౌరవించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం రామంతాపూర్ చిన్న చెరువులో బిహారీ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన చట్ పూజలో పాలొన్నారు. సరస్వతి పూజ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ఎన్నో రాష్ర్టాలకు చెందిన వారు నివసిస్తున్నారని, వారి సంప్రదాయాలను, ఆచారాలను మన రాష్ట్రంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బండారు శ్రీవాణి, నాయకులు సుధాకర్, రాజు, అశోక్, వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.