రామంతాపూర్ : రామంతాపూర్ భగాయత్ లో నిర్మించిన బీరప్ప దేవాలయంలో మంగళవారం శ్రీ రేణుకా ఎల్లమ్మ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం అమ్మవారికి అభిషేకం, అర్చన , ఎదుర్కోళ్లు, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు, మాజీ కార్పొరేటర్ మందమూల పరమేశ్వర్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సంఘం ప్రతినిధులు రేవు కృష్ణయ్య, శాగ రవీందర్ లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామి కల్యాణం, ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమలో సంఘం ప్రతినిధులు రావుల బీరప్పకురుమ , కౌడియాదయ్య కురుమ, నాగయ్య, ఆగమయ్య, ప్రభాకర్, కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.