జవహర్నగర్ : పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నగర పాలక సంస్థ 8వ డివిజన్ సంతోష్నగర్లో నరసింహగౌడ్ ఆధ్వర్యంలో 200 మట్టి వినాయక విగ్రహాలను డిప్యూటీ మేయర్ చేతుల మీదుగా ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మనోధర్రెడ్డి, బింగి సతీష్గౌడ్, మహేష్, శ్రీనివాస్గౌడ్, సాధిక్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు రజిత, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.