శామీర్పేట, జూలై 3 : ఆరోగ్య తెలంగాణ దిశగా పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీలో శనివారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని హరితహారం మొక్కలు నాటారు. అనంతరం రూ.1.50 కోట్లతో చేపట్టిన సెంటర్ లైటింగ్ ఏర్పాటు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ, పల్లె ప్రగతి ఏదైనా అభివృద్ధి కోసమేనని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో కోటి 40 లక్షల మొక్కలు నాటే దిశగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంసన్, మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, మిషనర్ గంగాధర్, కౌన్సిలర్లు రజినివేణుగోపాల్రెడ్డి, రాజ్కుమార్యాదవ్, లక్ష్మీకృష్ణారెడ్డి, సురేష్, యాదమ్మనర్సింగ్రావు, ఉమశ్రీనివాస్ముదిరాజ్, నర్సింగ్రావుగౌడ్, ఉమ ఆంజనేయులు, నర్సింగ్రావు, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజు పాల్గొన్నారు.
మేడ్చల్, జూలై 3: పట్టణ ప్రగతితో వార్డుల్లో నెలకొన్న సమస్యలు సత్వర పరిష్కారానికి నోచుకుంటున్నాయని మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నర్సింహారెడ్డి అన్నారు. 16వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతిలో వార్డు కౌన్సిలర్ ఉమానాగరాజుతో కలిసి కాలనీ ప్రజలతో సమావేశం నిర్వహించారు. కమిషనర్ సత్యనారాయణరెడ్డి, నాయకులు నర్సింహా రెడి పాల్గొన్నారు.
బోడుప్పల్, జూలై 3: బోడుప్పల్లోని 1వ డివిజన్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కార్పొరేటర్ బింగి జంగయ్యయాదవ్ స్థానిక నాయకులతో కలిసి మేయర్ బుచ్చిరెడ్డి చర్చించారు. మేయర్ , డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్ కార్పొరేషన్ పరిధిలోని ఆయా డివిజన్లలో పర్యటించి పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు.
పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతి పనులు చేపట్టి, పలు సమస్యలను పరిష్కరిస్తున్నామని మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ది యుగందర్రెడ్డి ఆధ్వర్యంలో బుద్ధానగర్లో పేరుకుపోయిన చెత్తను సిబ్బందితో తొలగింపజేశారు. రోడ్లకు ఇరువైపులా హరితహారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్, జూలై 3: పట్టణ ప్రగతితో సమస్యలు పరిష్కారం అవుతున్నాయని నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. నాగారం మున్సిపల్ పరిధిలోని 5, 6వ వార్డులలో నిర్వహించిన హరితహారం, పట్టణ ప్రగతిలో చంద్రారెడ్డి పాల్గొని ఇంటింటికి మొక్కలు అందజేశారు. దమ్మాయిగూడ 11, 12వ వార్డులో హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించారు.
మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11, 13, 14వ వార్డుల్లో చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు.టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యురాలు జయశ్రీజనార్దన్ రెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ అమరేందర్ రెడ్డి, పాల్గొన్నారు.
శామీర్పేట, జూలై 3 : జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో మేక లలితాయాదవ్ కాలనీ వాసులకు మొక్కలు పంపిణీ చేశారు. 8వ డివిజన్లో డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్గుప్తా ఇంటింటికి 6 మొక్కలు పంపిణీ చేయడంతో పాటు పలు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు, కో ఆప్షన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.