నేరేడ్మెట్, మే 14: స్వీయ నియంత్రణే ప్రధాన ఆయుధమని.. మన కోసమే కాదు.. మనవారి కోసం తప్పనిసరిగా మాస్కు ధరించాలి.. స్వీయ నియంత్రణే మొదటి, ప్రధాన ఆయుధమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఒక ప్రకటన విడుదలజేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు అన్ని విధాలుగా కరోనా కట్టడికి కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ను కఠినం గా అమలవుతుందన్నారు. అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితిల్లోనూ బయటకు రావొద్దన్నారు. ఉదయం 6 నుం చి 10 గంటల మధ్య నిత్యావసరరాల కోసం బయటకు వచ్చే సందర్భంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు. ప్రజలంతా భౌతికదూ రం పాటిస్తూనే, చేతుల్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు.