గౌతంనగర్, సెప్టెంబర్ 20 : టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం మౌలాలి డివిజన్, గాంధీనగర్లో కమ్యూనిటీహాల్ పై అంతస్థు ఏర్పాటుకు రూ.10లక్షలతో అంచనావేసిన పత్రాన్ని ఎమ్మెల్యే.. కాలనీ అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీ, బస్తీల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కరిస్తానన్నారు. త్వరలోనే భజన మందిర్, ఈస్ట్ ప్రగతినగర్, గాంధీనగర్లో కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలు చేపడుతామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలోనే తాగునీరు, కరెంటు కష్టాలు లేవని తెలిపారు. కార్యక్రమంలో గాంధీనగర్ అసోసియేషన్ అధ్యక్షుడు బుడంపల్లి శ్రీనివాస్గౌడ్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఎండీ సాధిక్, గండికోట రమేశ్, గున్నాల ప్రవీణ్గౌడ్, బాలస్వామి, కాశప్ప, ప్రభాకర్, యాదగిరి, రాము తదితరులు పాల్గొన్నారు.