దుండిగల్,సెప్టెంబర్ 23 : అన్నివర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ శంభీపూర్కృష్ణ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్ పెద్దచెరువులో గురువారం ఆయన కౌన్సిలర్లు, అధికారులతో కలిసి చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా శంభీపూర్కృష్ణ మా ట్లాడుతూ.. రాష్ట్రంలోని సబ్బండవర్గాల ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. మత్స్యకారుల అభివృద్ధికోసం చెరువుల్లో చేపలను పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఫలితంగా మత్స్యకారులు ఉపాధి అవకాశాలు పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో మత్స్య సహాకార సంఘం డైరెక్టర్ చినంగి వెంకటేశం, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్యాదవ్, బౌరంపేట పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్రెడ్డి, వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, దుండిగల్ మున్సిపాలిటీ కమిషనర్ భోగీశ్వర్లు, కౌన్సిలర్లు జక్కుల కృష్ణాయాదవ్, గోపాల్రెడ్డి, ఆనంద్, విజయ, సాయియాదవ్, దుండిగల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మద్దికుంట సంజీవరెడ్డి, నేతలు శ్రీనివాస్, రంజిత్రెడ్డి పాల్గొన్నారు.