దుండిగల్, సెప్టెంబర్ 9 : పేద ప్రజల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.10లక్షల 33వేల విలువచేసే సీఎం సహాయనిధి చెక్కులను శంభీపూర్లోని ఆయన కా ర్యాలయంలో గురువారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్, బౌరంపేట పీఏసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, దుండిగల్ మున్సిపాలిటీ వైస్చైర్మన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, నర్సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అనంతస్వామి, శంకర్నాయక్, గోపాల్ రెడ్డి, సాయియాదవ్, గాజుల రామారం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షు డు విజయరాంరెడ్డి, నేతలు చినంగి వెంకటేశం, పోలీస్ గోవింద్రెడ్డి, రవీందర్యాదవ్, హన్మంతరావు, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 9 : కాలనీల అభివృద్ధికి సంక్షేమ సంఘా ల పాత్ర కీలకమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం జీడిమెట్ల డివిజన్, వెంకటేశ్వరకాలనీ వెస్ట్ సంక్షేమ సంఘంతో పాటు రంగారెడ్డినగర్ డివిజన్, ఆదర్శ్ నగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సంక్షేమ సంఘాల నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.