దుండిగల్,జూన్ 25 : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నలుగురు లబ్ధిదారులకు శుక్రవారం ఆయన కార్యాలయంలో రూ. లక్ష 80వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ చిట్ల దివాకర్, టీఆర్ఎస్ నేతలు నగేశ్చారీ, యాదగిరి, లక్ష్మీనారాయణ, శ్రీహరి పాల్గొన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు శుక్రవారం ఎమ్మెల్సీ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వివరించి, నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, కార్యదర్శి మందిపల్ వెంకట్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణ, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కవిత, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి, వెంకట్రెడ్డి, కిరణ్జ్యోతితో పాటు మాజీ జడ్పీ వైస్చైర్మన్ బొంగునూరి ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.