దుండిగల్ : ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తించి ఈ నెల 14న జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ్ఞానులైన గ్రాడ్యుయేట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలికి భారీ మెజార్టీతో గెలిపించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, బాచుపల్లిలోని (మైటాస్) హిల్కౌంటీ గేటేడ్ కమ్యూనిటీలోని క్లబ్హౌజ్లో నిజాంపేట మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్థానిక పట్టభద్రులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన ఆరేండ్లలో ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి, విజయవంతంగా అమలు చేస్తున్న విషయం అందిరికీ తెలిసిన విషయమే అన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న జరుగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి గ్రాడ్యుయేట్లు మద్దతు పలికి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో హిల్కౌంటీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో పాటు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
బాచుపల్లిలోని ఎస్ఎల్జీ వైద్యశాలలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి శనివారం పలువురు వైద్యులు, వైద్య సిబ్బందిని కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్(ఎన్ఎంసీ) 16వ వార్డు కార్పొరేటర్, ఎన్ఎంసీ టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ ఆగం పాండు ముదిరాజు తన కార్యాలయంలో పట్టభద్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి ప్రథమ ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గాజులరామారం, మార్చి 6 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎ న్నికల ప్రచారంలో భాగంగా శనివారం జగద్గిరిగుట్టలో కార్పొరేటర్ కొలకుల జగన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రులను కలుసుకుని టీఆర్ఎస్ అ భ్యర్థి సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్యప్రచారాన్ని తిప్పికొట్టేలా టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.