జవహర్నగర్, ఆగస్టు 15: తెలంగాణలో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్నగర్ ఉత్సవ కమిటీ చైర్మన్ బల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. శివసత్తుల పూనకాలు, ఒగ్గుడోలు కళాకారులు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, వర్షాలు బాగా కురిసి పంటలు పండాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్గుప్తా, నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్మెంబర్లు, టీఆర్ఎస్ నాయకులు మేకల అయ్యప్ప, యువజన విభాగం అధ్యక్షుడు భార్గవ్రామ్, ప్రజలు పాల్గొన్నారు.
జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ ప్రగతినగర్లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మేడ్చల్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు జింక నాగులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. సంపత్యాదవ్, భారత్, చంద్, గణేశ్, ప్రకాశ్ పాల్గొన్నారు.
ఘట్కేసర్ : పోచారం మున్సిపాలిటీ 1, 2వ వార్డులు ఇస్మాయిల్ఖాన్గూడ,యంనంపేట్ గ్రామాల్లో ఆదివారం బోనాలు నిర్వహించారు.గ్రామంలోని మహంకాళి, మైసమ్మ, పోచమ్మ ఆలయాలకు గ్రామస్తులు బోనాలు సమర్పించారు.ఇస్మాయిల్ఖాన్గూడలో పోచారం మున్సిపాలిటీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలేశ్, కౌన్సిలర్ మహేశ్ , యంనంపేట్లో కౌన్సిలర్ ధనలక్ష్మి, గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. చైర్మన్ కొండల్రెడ్డి, వైస్చైర్మన్ రెడ్యానాయక్ కమిషనర్ సురేశ్, భక్తులు పాల్గొన్నారు.
కీసర : బీరప్ప ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. గోధుమకుంటలో ఆదివారం బీరప్ప ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు మంత్రి హాజరై బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్రెడ్డి, ఉప సర్పంచ్ ఆంజనేయులు, పలువురు పాల్గొన్నారు.