మేడ్చల్ రూరల్, అక్టోబర్ 18 : మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో ఉన్న మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం పాలకవర్గ సభ్యులు, అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఏడాది మార్కెట్ కమిటీకి రూ.4కోట్లు ప్రభుత్వం కేటాయిస్తున్నదని తెలిపారు. కొంత కాలంగా అధికారులు లేకపోవడం వల్లే పనుల్లో కొంత జాప్యం జరిగిందన్నారు. మార్కెట్ కమిటీ భవన నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం పలు అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాసిని రవీందర్ యాదవ్, వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ పీఏసీఎస్ చైర్మన్ రణదీప్ రెడ్డి, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, మార్కెటింగ్ శాఖ డీఈ శోభారాణి, కార్యదర్శి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.