మేడ్చల్, సెప్టెంబర్ 14: చిన్నారిపై లైంగిక దాడి.. ఆపై హత్య చేసిన నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటామని.. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్లోని పార్టీ కార్యాలయంలో గ్రామ కమిటీల సభ్యులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేయడం దారుణమన్నారు. నిందితుడిని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టి తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటామని తెలిపారు.