మేడ్చల్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా చెరువుల వద్ద నిర్వహించే ఛఠ్ పూజా కార్యక్రమాలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో శనివారం ఛఠ్ పూజాకార్యక్రమాల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని శామీర్పెట్, బోడుప్పల్, మేడ్చల్, హత్కేలీ చెరువుల వద్ద మూడు రోజుల పాటు జరుగనున్న కార్యక్రమాలను విజయవంతం చేసేలా అధికారులు చూడాలన్నారు. చెరువుల వద్ద టెంట్లు, విద్యుత్, లైటింగ్ ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పించి శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, డీఆర్వో లింగ్యానాయక్, ఆర్డీవోలు, తాసీల్దార్లు , జనసేవా సంఘం అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.