మేడ్చల్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాధికారి ఎన్.ఎస్.ఎస్.ప్రసాద్కు భారతీయ జ్ఞాన్ రత్న అవార్డును పొందారు. విద్య, సంబంధిత విషయాలలో ఆయన అందించిన సేవలను గ్లోబల్ స్కాలర్స్ ఫౌండేషన్ గుర్తించింది. దీంతో విద్యాధికారికి గోవాలోని నోవాటెల్ క్యాండోలిమ్ వేదికపై భారతీయ జ్ఞాన్ రత్న అవార్డును ఈ నెల 23న ప్రదానం చేసినట్లు విద్యాధికారి ప్రసాద్ సోమవారం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులలో గుణాత్మక విద్యను అందిస్తూనే మధ్యాహ్న భోజనంతో పౌష్టిక ఆహారాన్ని అందించే విధంగా అనేక కార్యక్రమాలను రూపొందించారు. విద్యార్థుల భవిష్యత్తుకు కృషి చేస్తున్న విద్యాధికారి ప్రసాద్ను ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, జిల్లా కలెక్టర్ హరీశ్లు అభినందించారు.