కుత్బుల్లాపూర్,అక్టోబర్16 : ఓ వివాహిత అదృశ్యమైన సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందినసోనూకుమార్ చౌదరి, దీపిక దంపతులు. నాలుగునెలల క్రితం ఉపాధి కోసం వలస వచ్చి మైసమ్మగూడలోని గుడిసెల్లో నివాసముంటున్నారు.
సోనూకుమార్ చౌదరి తాపీ మేస్త్రీగా పనిచేస్తుండగా దీపిక (22) గృహిణి. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో బయటకు వెళ్లిన దీపిక రాత్రి పొద్దుపోతున్నప్పటికి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళనకు గురైన భర్త సోనూకుమార్ చౌదరి చట్టుపక్కల ప్రాంతాలల్లో వెతికాడు. బంధువులు, స్నేహితుల ఇండ్లల్లో ఆరా తీసాడు.
అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీ
సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.