దుండిగల్, అక్టోబర్1:వితుంతువులను,ఒంటరి మహిళలను పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…భూపాల్పల్లి-జయశంకర్ జిల్లా,ములుగు మండలం,ఇంచర్ల గ్రామానికి చెందిన కోరండ్ల సాగర్రెడ్డి కొడుకు కోరండ్ల కిరణ్కుమార్ రెడ్డి(29) సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేశాడు. గతేడాది పెండ్లి చేసుకునేందుకు మాట్రీమోని సైట్లను వీక్షించాడు.
ఈ క్రమంలో వితంతు, ఒంటరి మహిళలను గుర్తించి, పెండ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి..దారిలోకి తెచ్చుకునేవాడు. అనంతరం వారి వద్ద నుంచి అందినకాడికి దండుకుని తప్పించుకుంటున్నాడు. ఇలా ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు మహిళను మోసగించి లక్షల్లో దండుకున్నాడు.తదనంతరం కొన్ని రోజలు పాటు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని తప్పించుకుని తిరుగుతాడు.
మళ్లీ కొత్త సిమ్తో కథ మొదలు పెడతాడు. తన వలలో చిక్కిన మహిళలతో తనకు పెండ్లి అయిందని,అయితే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చెప్పి సానుభూతిని పొందుతాడు.అనంతరం అతని ప్లాన్ను మెల్లిగా అమలు చేసి అందిన కాడికి దండుకుని జారుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నాడు.వాస్తవానికి కిరణ్కుమార్రెడ్డికి ఇప్పటివరకు పెండ్లి కాలేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
కిరణ్కుమార్రెడ్డి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఈ ఏడాది ఆగస్టు 22న బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.దీంతో శుక్రవారం అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. కాగా కిరణ్కుమార్రెడ్డి చేతిలో మోసపోయి ఫిర్యాదు చేసిన మహిళ.. గతనెల 19న మానసిక ఆందోళనలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.