మేడ్చల్, సెప్టెంబర్ 30: తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు అండగా నిలుస్తుందని మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వం కార్మికులకు కల్పిస్తున్న వసతులకు సంబంధించిన కరపత్రాన్ని మర్రి రాజశేఖర్రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ, అసంఘటిత కార్మికులు లేబర్ కార్డులను తీసుకోవాలని సూచించారు. కార్మికులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ గౌరవ అధ్యక్షుడు రూప్సింగ్, రాములు తదితరులు పాల్గొన్నారు.